బుధవారం 8 సెప్టెంబర్ 2010

నీ సంగతి చెప్పవయ్యా...

ముగ్గురు స్నేహితులు రోడ్డు ప్రమాదం లో మరణించారు. వాళ్ళ ని తీసుకుని వెళ్ళటానికి వచ్చిన యమభటులు ఇప్పుడు మీ కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులూ మీ గురించి ఏమి మాట్లాడుకుంటే మీకు బాగుంటుందో చెప్పండి. మా వీలుని బట్టి అలా మాట్లాడేలా కుదురుతుందేమో చూస్తాం అన్నారు.


మొదటి వ్యక్తి: నా సమ కాలీకుల్లో నా అంత గొప్ప డాక్టర్ లేడని ఇక రాడనీ చెప్పు కోవాలి.


యమభటులు: ఒహ్... ఇంతేనా అదేం భాగ్యం. అలాగే చెప్పేలా చేస్తాం


రెండవ వ్యక్తి: నేనో ప్రముఖ టీచర్ ని. అందరూ నా అంత గొప్ప టీచర్ లేడని, ఎందరో విద్యార్ధుల భవిష్యత్తుని తీర్చి దిద్దానని అందరూ నా గురించి గొప్పగా చెప్పుకోవాలి


యమభటులు: ఒహ్... ఇంతేనా అదేం భాగ్యం. అలాగే చెప్పేలా చేస్తాం.


నీ సంగతి చెప్పవయ్యా అన్నారు యమభటులు అక్కడ ఉన్న మూడవ వ్యక్తి స్నేహిత్ తో.


స్నేహిత్: అరె... చూడండి మన స్నేహిత్ కదులుతున్నాడు అని అందరూ అనుకోవాలి.


యమభటులు: హా....!

మంగళవారం 7 సెప్టెంబర్ 2010

అర్ధరాత్రి ప్రసంగం

జోగప్ప పీకల దాకా తాగి అర్ధరాత్రిపూట రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతున్నాడు. తనని చూసిన ఒక పోలీసు తనని ఆపాడు.

పోలీసు: అర్ధరాత్రి పూట ఇటు ఎక్కడికయ్యా?

జోగప్ప: తాగుడు వల్ల తాగుబోతుల వల్ల వచ్చే అనర్ధాల మీద ప్రసంగం వినటానికి వెళుతున్నాను.

పోలీసు: అర్ధరాత్రి పూట ప్రసంగాలా? ఈ టైం లో ఎవరయ్యా ప్రసంగాలు ఇచ్చేది?

జోగప్ప: మా ఆవిడ మరియు మా అమ్మ